మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా బెదింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని శివగంగ జిల్లాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. ట్విట్టర్ వేదికగా చిదంబరం, కార్తీ చిదంబరంపై సదరు నిందితుడు దుర్భషలాడాడు.
అంతే కాకుండా వారిపై దాడికి పాల్పడతానని బెదిరించాడు .. దీనిపై కేసు నమోదు చేయగా, వెంటనే సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. చిదంబరం ప్రస్తుతం రాజ్యసభలో ఎంపీ కాగా, కార్తీ చిదంబరం శివగంగ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.