గన్స్తో చెలరేగుతున్న హర్యానా రాష్ట్రం కన్వా గ్రామంలోని రెండు గ్యాంగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కపిల్ సంగ్వాన్, అలియాస్ నందు గ్యాంగ్.. జ్యోతిబాబా గ్యాంగ్.. ఈ రెండు గ్యాంగ్లను పట్టుకున్న పోలీసులు వారి నుంచి 12 పిస్టల్స్తోపాటు 47 కాట్రిడ్జ్లను, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. రెండు గ్యాంగ్ల మధ్య ఘర్షణ జరగడంతో ఇలా అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు.
అయితే.. ముందు పోలీసులను చూసిన ఒక నిందితుడు.. కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో గ్యాంగ్ సభ్యుడు గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పట్టుబడ్డ గ్యాంగ్ సభ్యులను లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలో ఈ ప్రాంతంలో ఎలాంటి నేరాలు చేశారు…? ఈ గ్యాంగ్కు పొలిటికల్ సపోర్ట్ ఉందా..? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ గ్యాంగ్కు తుపాకులు ఎలా చేరాయి..మరేవైనా గ్రూపులు ఉన్నాయా…అని విచారిస్తున్నారు. అయితే.. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ మంజీత్ మహల్ నేతృత్వంలో.. ప్రత్యర్థి ముఠా సభ్యులను పట్టుకోవడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.