అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూరు లో బుధవారం వేడుకగ శ్రీ మంచాలమ్మ తిరునాళ్ళు నిర్వహించారు. నిర్వాహకులు ఇంజమ్ రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ తిరునాళ్ళకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి మహిళా భక్తులు పొంగల్లు సమర్పించారు. అమ్మవారిని వివిధ పుష్పాలతో, స్వర్ణాభరణలతో,పట్టు వస్త్రాలతో అలంకరించారు.
రాజకీయ ప్రముఖులు జడ్పీ చైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి,టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట టీడీపీ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు, నందలూరు మండల అధ్యక్షుడు మేడా భాస్కర్ రెడ్డి,యువ నేత మేడా విజయ శేఖర్ రెడ్డి వారి అనుచరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని ఆలయం లో నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు,అన్న ప్రసాదాలు అంద జేశారు. ఆలయ ప్రాంగణంలో కళా బృందాల ప్రదర్శన భక్తులను ఆకట్టు కుంది.
కాగా రెండో రోజు గురువారం తిరునాళ్ళు ముగింపు సందర్భంగా వృషభరాజుల బండ లాగుడు పోటీలు నిర్వహించి నగదు పురస్కారాన్ని అందజేయ నున్నారు.