తెలంగాణ రాష్ట్రంలో SC, ST, BC , మైనార్టీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. బలహీన వర్గాల వారిపై అత్యాచారాలు పోరిగిపోతున్నా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
బలహీన వర్గాల మహిళలపై జరుగుతున్న హత్యలు, హత్యాచారాలను వ్యతిరేకిస్తూ నేడు హైదరాబాద్ , ఇందిరాపార్క్ – ధర్నా చౌక్ లో మంద కృష్ణ మాదిగ నాయకత్వం లో మహాదీక్ష జరిగింది. ఈ మహాదీక్షలో BC సంఘం జాతీయ అధ్యక్షుడు R. కృష్ణయ్య, దళిత సంఘాల నాయకులు జేబీ రాజు, మాజీ MLC రాములు నాయక్, మాల మహనాడు నాయకులు దిలీప్, ఇతర మైనార్టీ, దళిత, గిరిజన, బీసీ సంఘాల నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.