సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టడంతో వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిషత్ లో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. మండల పరిధిలోని సర్పంచులంత ముక్తకంఠంతో సమస్యలపై ఏకరువు పెట్టారు.
గ్రామంలో నిర్మించిన రైతు వేదిక.. శెగ్రియేశన్ షెడ్..పార్క్… వైకుంఠధామం తదితర నిర్మాణాలు చేపట్టినప్పటికీ బిల్లులు రావడంలేదని సర్పంచ్ లు లేవనెత్తారు. వీధి లైట్లు ఏర్పాటును కాంట్రాక్టర్లకు అప్పగించి సర్పంచులను గ్రామాల్లో దిష్టిబొమ్మలు గా చేస్తున్నారని విమర్శించారు.
జాయింట్ చెక్పవర్ ను రద్దు చేయాలని …వీధిలైట్లు కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వసభ్య సమావేశంలో అంశాల వారీగా చర్చను కొనసాగనివ్వలేదు. సమావేశంలోని కింద కూర్చుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ప్రభుత్వం సర్పంచులకు 30 వేల వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధ్యక్షుడికి అందించగా సర్వసభ్య సమావేశం ను వాయిదా వేస్తున్నట్లు అధ్యక్షుడు ఎంపీపీ కమలేశ్వా రావు ప్రకటించారు.