రాష్ట్ర ఎస్సి సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున పిలుపు మేరకు వై సి పి మంగళగిరి పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు సంకే సునీత ఆధ్వర్యంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.
మంగళగిరిలోని గౌతమ బుద్ధ రోడ్డు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డక శివ పార్వతి, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు సురేష్, నాయకులు సంకె ప్రతాప్, వెంకయ్య, లేళ్ల సురేష్, రంగిశెట్టి పెద్దబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు.