ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఐదు రోజుల సీబీఐ రిమాండ్లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాదులు అరెస్ట్పై, సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పిటిషన్ వేశారు. కేసు విచారణను వేగవంతం చేయాలని మనీష్ సిసోడియా తరపు న్యాయవాది కోర్టులో అప్పీలు చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఈ పిటిషన్ను త్వరలో ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రస్తావించనున్నారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కోర్టు ఐదు రోజుల పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించింది. విచారణ దృష్ట్యా రిమాండ్ అవసరమని కోర్టు అంగీకరించింది. మరోవైపు, ఎక్సైజ్ పాలసీలో మార్పులకు అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారని అంటున్నారు. సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ముందు హాజరుపరిచిన దర్యాప్తు అధికారి విచారణ కోసం ఐదు రోజుల కస్టడీని కోరారు. సిబిఐ డిమాండ్ను అంగీకరించిన కోర్టు సిసోడియాను మార్చి 4 వరకు సిబిఐ కస్టడీకి అప్పగించింది.
2021-22 ఎక్సైజ్ పాలసీ (ఇప్పుడు రద్దు చేయబడింది) అమలులో జరిగిన అవినీతికి సంబంధించి సిసోడియాను ఆదివారం సాయంత్రం సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసులో తన పాత్ర లేదని సిసోడియా పేర్కొన్నారని, అయితే ఆయన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారని విచారణలో తేలిందని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇవే కాకుండా ధ్వంసమైన ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి ఆరా తీయాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది.
అందువల్ల ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించారు. రిమాండ్పై సిసోడియా తరపు న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ సిసోడియా తన మొబైల్ ఫోన్ మార్చుకున్నారని, అయితే అది నేరం కాదన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సలహా తీసుకున్న తర్వాత ఈ విధానం అమలు చేశారని, కాబట్టి కుట్రకు ఆస్కారం లేదని తెలిపారు. సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, సిసోడియా ఆర్థిక మంత్రి అని, ఆయన బడ్జెట్ను సమర్పించాల్సి ఉందన్నారు.