ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దాఖలు చేసిన తొలి చార్జి షీట్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కనిపించలేదు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు చేసుకుంటున్నది. ఒక కట్టు కథ కల్పించి తన నివాసంపై సీబీఐ దాడులు చేసిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీపై విరుచుకుపడ్డారు. తన పరువు తీశారని మనీష్ సిసోడియా అన్నారు. ఈరోజు సీబీఐ చార్జ్ షీట్ ద్వారా ఇది బీజేపీ కుట్ర అనేది స్పష్టమైందని ఆయన అన్నారు. ఎల్జీ, సీఎస్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ తప్పుడు నివేదికలు తయారు చేసిందని ఆయన అన్నారు. మనీష్ సిసోడియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని, అందుకే ఎల్జీ, సీఎస్లను ఆ పదవి నుంచి తప్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.
previous post
next post