28.7 C
Hyderabad
April 20, 2024 07: 34 AM
Slider జాతీయం

తొలి చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేదు

#manishsisodia

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దాఖలు చేసిన తొలి చార్జి షీట్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కనిపించలేదు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు చేసుకుంటున్నది. ఒక కట్టు కథ కల్పించి తన నివాసంపై సీబీఐ దాడులు చేసిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీపై విరుచుకుపడ్డారు. తన పరువు తీశారని మనీష్ సిసోడియా అన్నారు. ఈరోజు సీబీఐ చార్జ్ షీట్ ద్వారా ఇది బీజేపీ కుట్ర అనేది స్పష్టమైందని ఆయన అన్నారు. ఎల్‌జీ, సీఎస్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ తప్పుడు నివేదికలు తయారు చేసిందని ఆయన అన్నారు. మనీష్ సిసోడియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని, అందుకే ఎల్జీ, సీఎస్‌లను ఆ పదవి నుంచి తప్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.

Related posts

జాన్ ప‌హాడ్ ఉర్సు ఉత్స‌వాల్లో ప్ర‌ముఖులు

Sub Editor

చేనేత‌ల త‌ల‌రాత మార్చే యువ‌నేత‌

Satyam NEWS

అమరావతి రైతులకు అండగా ఉండేందుకు జస్టిస్ రాకేష్ కుమార్ సిద్ధం

Satyam NEWS

Leave a Comment