27.7 C
Hyderabad
April 18, 2024 07: 28 AM
Slider ఆదిలాబాద్

కరోనాతో మావోయిస్టు నేత మధూకర్ మృతి

#Maoist Madhukar

మావోయిస్టు నాయకుడు గడ్డం మధుకర్ కరోనాతో మరణించాడు.

ఈ నెల 2వ తేదీన కరోనా చికిత్స కోసం మధుకర్ వరంగల్ రావడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆయన చికిత్స పొందుతూనే మరణించాడు. గడ్డం మధుకర్ దండకారణ్య డివిజనల్ కమిటీ సెక్రటరీగా ఉన్నారు.

మధుకర్ స్వస్థలం కొమురం భీమ్ జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి. మధుకర్ 22 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ లో చేరారు.

చాలా మంది మావోయిస్టులకు కరోనా సోకింది. మధుకర్ మృతదేహాన్ని కుమురంభీం ఆసీఫాబాద్ జిల్లా కొండపల్లికి తరలించనున్నట్టు సమాచారం.

Related posts

కన్ఫ్యూజన్: నిమ్మగడ్డ లేఖపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేతలు

Satyam NEWS

పల్లె, ప‌ట్ట‌ణ‌ ప్రగతి, హ‌రిత‌హారంపై దృష్టి పెట్టాలి

Satyam NEWS

ఫిబ్రవరి 7న కుస్తీ పోటీలకు ఎంపికలు

Satyam NEWS

Leave a Comment