ప్రముఖ మావోయిస్టు అగ్ర నాయకుడు, దివంగత పటేల్ సుధాకర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తి రావులచెరువు గ్రామంలో ఆయన స్థూపానికి కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కుర్తి రావులచెరువు గ్రామానికి చెందిన బోజ్జమ్మ వెంకట్రామిరెడ్డి రెండవ కుమారుడైన పటేల్ సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండే విప్లవం వర్ధిల్లాలి అంటూ ఆర్ ఎస్ యు లో ఉంటూ మావోయిస్టు ఉద్యమం లోకి వెళ్ళిపోయాడు.
అప్పటి ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్ నిర్వహించి పటేల్ సుధాకర్ రెడ్డిని తుదముట్టించారని ఆయన సోదరుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా పటేల్ సుధాకర్ రెడ్డి సోదరులు శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి , పటేల్ సుధాకర్ రెడ్డి కుమారుడు పటేల్ చేసి రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.