39.2 C
Hyderabad
March 29, 2024 16: 39 PM
Slider విశాఖపట్నం

మావోల మందుపాతర పేలి ఇద్దరు గిరిజనుల మృతి

#Maoiest Vizag

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మరణించారు. మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నేపథ్యంలో పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి మావోయిస్టులు వీటిని ఏర్పాటు చేశారు.

పెదబయలు మండలం ఇంజేరి, జాముగుడా  పంచాయతీ సమీపంలో కొండ్రుము, చింతలవిధి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ మందు పాతరలను ఆ ఇద్దరు గిరిజనులు గమనించలేదు.

పశువుల కాపుకు వెళ్లిన ఇద్దరు గిరిజనులు మందుపాతర పేలి  మృతి చెందారు. మరణించిన వారిని మొండిపల్లి మోహన్ రావు(25), మొండిపల్లి అజయ్ కుమార్ (17)గా పోలీసులు గుర్తించారు.

Related posts

కరోనిల్ ఉత్పత్తిలో అన్ని నిబంధనలు పాటించాం

Satyam NEWS

వైసీపీ హయాంలో మైనారిటీలకు వంచన…

Bhavani

కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటా: బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

Leave a Comment