విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మరణించారు. మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నేపథ్యంలో పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి మావోయిస్టులు వీటిని ఏర్పాటు చేశారు.
పెదబయలు మండలం ఇంజేరి, జాముగుడా పంచాయతీ సమీపంలో కొండ్రుము, చింతలవిధి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ మందు పాతరలను ఆ ఇద్దరు గిరిజనులు గమనించలేదు.
పశువుల కాపుకు వెళ్లిన ఇద్దరు గిరిజనులు మందుపాతర పేలి మృతి చెందారు. మరణించిన వారిని మొండిపల్లి మోహన్ రావు(25), మొండిపల్లి అజయ్ కుమార్ (17)గా పోలీసులు గుర్తించారు.