మావోయిస్టుల వద్ద ఆధునిక ఆయుధాలతో పటు వారి రక్షణకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, టోపీలు లాంటి వస్తువులు ఉంట్లు పోలీస్ లు గుర్తించారు. ఆపరేషన్ ప్రహార్ లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టయి.ఈ సందర్భంగా సుక్మా ఏఎస్పీ సిద్దార్థ్ తివారీ సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలతో నిర్వహించిన సమీక్షలో ఆసక్తికర విషయాలను వెల్లడయ్యాయి.
మావోయిస్టులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, టోపీలు ధరించారని ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులను దగ్గరగా చూసిన సీఆర్పీఎఫ్, కోబ్రా సభ్యులు తివారి దృష్టికి తెచ్చారు. వీటితో పాటు వారు యుబీజీఎస్ అత్యాధునిక అండర్ బేరల్ గ్రెనేడ్ లాంఛర్లు కలిగి ఉన్నారని ఎదురుకాల్పుల్లో పాల్గొన్న సీఆర్పీఎఫ్, కోబ్రా దళ సభ్యులు చెప్పారు.దీనితో మావోయిస్టు లి అత్యాధునిక సమమాగ్రి కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.