జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం నందు పద్మశాలి జిల్లా కమిటీ సేవా సంఘం జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.
మార్కండేయ విగ్రహాన్ని మేళతాళాలతో పద్మశాలీలు భక్తిశ్రద్ధలతో పుర వీధుల్లో ఊరేగించారు. అనంతరం మార్కండేయ స్వామి వారికి డోలారోహణం నామకరణం చేశారు. పద్మశాలి కుల బాంధవులు మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి పద్మశాలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సేవా సంఘం జిల్లా యువజన సంఘం పట్టణ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు కమిటీ నెంబర్లు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిపారు.