భారీగా కురుస్తున్న వర్షాలతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల ముంపుకు గురైన ప్రాంతాలను తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డ్ CEO అజిత్ రెడ్డి, బోర్డ్ సభ్యులు మహేశ్వర రెడ్డి, పాండు యాదవ్ లతో కలసి పర్యటించారు.
కంటోన్మెంట్ పరిధిలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మొదటివార్డ్, 6 వ వార్డులలో నాళాలు పొంగిపొర్లుతున్నాయి. అవసరమైన చోట విపత్తుల నిర్వహణా వారి సహాయ సహకారాల అందించాలని CEO ని కోరారు.
అష్మన్ పేట చెరువు నుంచి బయటకు పొంగిన నీరు ధారాళంగా రామన్నకుంటా చెరువులో కలవడం తో కంటోన్మెంట్ ప్రాంతంలో తీవ్ర స్థాయి నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ కు ఫోన్లో మర్రి రాజశేఖర్ రెడ్డి వారి దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోమని కోరారు.
ముంపునకు గురైన చోట రీలిప్ వర్క్స్ ని పోలీస్,రెవెన్యూ, బోర్డ్ మరియ GHMC అధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఉన్నతాధికారులు, రెవెన్యూ, మరియు GHMC అధికారులు పాల్గొన్నారు.