39.2 C
Hyderabad
April 23, 2024 18: 54 PM
Slider ముఖ్యంశాలు

కన్నుల పండుగగా జగదాభిరాముని కళ్యాణం

#bhadradri

జగదాభిరాముని కళ్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం లో అశేష భక్త జనం మధ్య  వేద మంత్రోచారణల నడుమ , జై శ్రీరామ్ నినాదాలతో వైభవంగా జరిగింది. సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నం లో వేద పండ్డితులు సీతా రాములకు జీలకర బెల్లం పెట్టారు. ఆ సమయంలో మిథిల స్టేడియం రామ నామంతో  మార్మోగింది. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.

ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను మంత్రి సమర్పించారు. ఏటా జరిగే ఈ వేడుకలు ఈసారి మాత్రం భిన్నంగా జరిగాయి. సీతారాముల విగ్రహాలను ఈ ఏడాది సువర్ణ ద్వాదశ వాహనాలపై ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ వాహనంలో స్వామి వారిని ఊరేగించేవారు. ఇటీవల ఆ వాహనాలకు మరమ్మతులు పూర్తిచేయడంతో వేదపండితులు తిరిగి ఆ క్రతువును ప్రారంభించారు. స్వామి వారి కల్యాణం కోసం మిథిలా స్టేడియాన్ని 26 సెక్టార్లుగా మార్చిన అధికారులు.. సుమారు 70 కి పైగా తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేశారు.

భద్రాచలం పట్టణంలో పలుచోట్ల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వామి వారి ఆలయం,మిథిలా స్టేడియం,దాని పరిసరాలను వివిధ రకాల పూలు,మామిడి ఆకు తోరణాలు,కాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.వేలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణాలు,మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాన్ని  లక్షల మంది తిలకించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు,జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలు సీతారాముల వారికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతమ్మ వారికి సిరిసిల్ల నేత కార్మికులు ప్రత్యేకంగా నేసిన పట్టు చీరను ఈ సందర్భంగా అందజేయడం విశేషం. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రికి భక్తజనం పోటెత్తారు.

సీతారాముల కల్యాణం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కళ్యాణ బ్రహ్మోత్సవానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం,లోకసభ సభ్యురాలు మాలోతు కవిత,శ్రీత్రిదండి చినజీయర్ స్వామి,తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలి ఛైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, ఎమ్మెల్యేలు పోడెం వీరయ్య,కందాళ ఉపేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ప్రముఖ వ్యాపారవేత్తలు వద్దిరాజు నిఖిల్ బాబు, వద్దిరాజు నాగరాజు బాబు,ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అధికార, అనధికార ప్రముఖులు సీతారాముల కళ్యాణానికి హాజరయ్యారు.కళ్యాణం అనంతరం వేద పండితులు తలంబ్రాలు అందజేశారు.

Related posts

కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ ప్రజాగోస

Satyam NEWS

రష్యా వద్ద ఆయుధాలు అయిపోతున్నాయోచ్

Satyam NEWS

అందుబాటులోకి అధిక పింఛను ఆన్లైన్ దరఖాస్తు

Murali Krishna

Leave a Comment