కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో మహిళ మృతదేహం లభ్యం కావడం ఇక్కడ కలకలం రేపింది. మృతురాలు రైల్వే కోడూరు అంబేద్కర్ నగర్ కు చెందిన గడికోట పద్మావతిగా పోలీసులు గుర్తించారు. ఆమె ప్రైవేట్ కళాశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. భర్త సుబ్రహ్మణ్యంతో గొడవపడి నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి వచ్చినట్లు సమాచారం. చెరువు కట్టపై ఉన్న దుర్గమ్మ గుడి మెట్లపై బట్టలు సెల్ ఫోన్ ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలం వద్దకు చేరుకుని పోలీసులు కేసును విచారిస్తున్నారు.
previous post