భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం తీసుకున్నది. అన్నప్రసాదం మెనూలో టీటీడీ అధికారులు మార్పులు చేస్తున్నారు. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన నిర్వహించారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా మసాలా వడలను టీటీడీ తయారు చేసింది. ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు 5వేల మంది భక్తులకు మసాలా వడలు వడ్డించారు. మసాలా వడలు రుచికరంగా వున్నాయి అని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 04వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా టీటీడీ చర్యలు తీసుకుంటున్నది.