బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అంబర్ పేట్ మెయిన్ రోడ్డు బడి మసీదులో జీహెచ్ఎంసీ సిబ్బందితో పారిశుద్ధ్య పనులను చేయించారు. అంబర్ పేట్ మెయిన్ రోడ్డు బడి మసీద్, గంగబౌలి రోడ్డు జంజం మసీద్, భరత్ నగర్ వెనక ఉన్న అజీజ మజీద్, రామకృష్ణ నగర్ మజీద్ లలో మజీద్ కమిటీ సభ్యులకు జీహెచ్ఎంసీ ద్వారా డస్ట్ బిన్ బ్లాక్ కవర్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బాగ్ అంబర్ పేట్ డివిజన్ లోని అన్ని మసీదుల దగ్గర జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా శానిటేషన్ పనులు, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ద్వారా శానిటైజర్ స్ప్రే చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జ్ బి.వెంకట్ రెడ్డి, డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, ప్రధాన కార్యదర్శి జమ్మిచట్టు బాల రాజు, బిజెపి నాయకులు మిర్యాల శ్రీనివాస్, వెంకటేష్ ముదిరాజ్, వంగూరి సుధాకర్, నీలకంఠం మురళి, మైనార్టీ మోర్చా నాయకులు మహమ్మద్ అతీక్, మహమ్మద్ షరీఫ్, బాబాయ్, యువమోర్చా నాయకులు బాలకృష్ణ గౌడ్, యోగేష్ గౌడ్, మహిళా మోర్చా నాయకురాలు సునంద, వరలక్ష్మి , మజీద్ కమిటీ సభ్యులు లాలా బాయ్, సాదేక్ బాయ్, ఇఫ్తకార్, బాచిత్, జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఏ ఆంజనేయులు, హరినాథ్ వారి సిబ్బంది పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట