ఎంతో కాలంగా ఎంతో మంది ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం నేడు దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది.
ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు అంటే కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ అందచేస్తున్నారు.
ఇంత వరకూ బాగానే ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆ తర్వాత కూడా మాస్క్ ధరించడం తప్పని సరి. మాస్క్ ధరించడమే కాదు, సమూహాలుగా గుమికూడటం కుదరదు.
దేశంలో మొత్తంగా కరోనా సోకే వారి సంఖ్య తగ్గడం మొదలు పెట్టాలి.
కరోనా కేసులు పూర్తిగా తగ్గి పోయిన తర్వాతే ముక్కుకు మాస్క్ తీసేసే వీలు ఉంటుంది. అప్పటి వరకూ మూస్క్ తప్పని సరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.