క్లిష్టమైన కరోనా లాక్ డౌన్ నేపథ్యంల విశిష్ట సేవలు అందిస్తున్న మీడియా ప్రతినిధులు తమను తాము రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో కడప జిల్లా వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు గీతాల నరిసింహారెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. నందలూరు మండలంలో నేడు జరిగిన ఈ కార్యక్రమానికి సి.ఐ.హనుమంతు నాయక్, ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ సమయంలో కూడా క్షేత్ర స్థాయిలో సేవలందిస్తున్న మీడియా మిత్రులను గీతాల నరిసింహారెడ్డి అభినందించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులకు స్వచ్ఛంద సేవా వాలంటీర్ల కు వేల్పుల మురళీ దర్, టివి రిపోర్టర్ మద్దికెర ఓబులేసుల సహకారంతో విందు ఏర్పాటు చేశారు.