ఉస్మానియా యూనివర్సిటీ లోని పి డి ఎస్ యు రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం సోమవారం జరిగింది. రాష్ట్ర కమిటీకి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల, కొత్త తండ గ్రామ పంచాయతీకి చెందిన మాలోతు చంద్రరావు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా చంద్రరావు మాట్లాడుతూ సుధీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన పి డి ఎస్ యు ని విద్యార్థుల్లోకి తీసుకెళ్ళి బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహించే విధంగా కార్యక్రమాలు చేపడతామని,విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయికరణకి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. శాస్త్రీయతతో కూడిన ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని,బిశ్వాల్ కమిటీ పిఆర్సి నివేదికలు లక్షా తొంభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చిందని, కానీ ప్రభుత్వం 81 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం విద్యార్థులను, నిరుద్యోగులు మోసం చేయడమే అవుతుంది అన్నారు.
వెంటనే ప్రభుత్వం ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, నూతన ఉద్యోగాలను రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్