32.2 C
Hyderabad
March 29, 2024 01: 01 AM
Slider మహబూబ్ నగర్

టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవం

#MBNRMayDay

మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. మేడే సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షుడు నారాయణస్వామి  ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకుడు చెన్నయ్య TNTUC జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ పని దినం సమయాల కోసం కార్మికులు తమ రక్తాన్ని చిందించారని, వారి త్యాగాల ఫలితంగా కార్మికులకు 8 గంటల  పనిదినం దక్కిందని అన్నారు. మన రాష్టంలో అసంసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులు  భవన నిర్మాణం ఇతర రంగాలు ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులు వెట్టి లో మగ్గుతున్నారని అన్నారు.

మే డే సందర్భంగా అసంఘటిత సంఘాలలో పని చేస్తున్న కార్మికులందరికీ స్వేచ్ఛ, సమానత్వం ఇవ్వాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు తుంగ మోపతయ్య, ప్రధాన కార్యదర్శి బాలప్ప , అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ వెంకటయ్య, కార్మిక నాయకుడు చెన్నయ్య, మైనార్టీ నాయకులూ అలీం, మురళి , కుమార్ ఎన్ బికె ట్రస్ట్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

చెరువులో నక్కిన మొసలి చేతికి చిక్కింది…

Satyam NEWS

పొలిటికల్ కార్నర్: కార్ల పై ఉన్న సోకు ప్రాంతంపై లేదు

Satyam NEWS

హాస్టళ్లు అద్దంలా ఉండాలి:వై ఎస్ జగన్

Satyam NEWS

Leave a Comment