విజయనగరం జిల్లాలో పలు కూడళ్లలలో కార్మిక దినోత్సవం జరిగింది. ఈ మేరకు జిల్లా ప్రధాన కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద లావు గంగాధర్ భవన్ వద్ద సీపీఎం మే డే దినోత్సవాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా కోట జంక్షన్ లో ఆటో కార్మికుల స్టాండ్ వద్ద సీఐటీయూ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కార్మి కులనుద్దేశించి మాట్లాడారు.
ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు కంపెనీ లు కి కార్పొరేట్ శక్తులు కు కట్ట బెడుతూ.. విశాఖ ఉక్కు ను పొస్కో కంపెనీకి అప్పచెప్పిన కేంద్ర ప్రభుత్వపు దుర్మార్గపు విధానాలను తిప్పి కొట్టాలన్నారు.. 45 కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్ లు గా మార్చి. దేశానికి నష్టం చేసే 3 రైతు వ్యతిరేక చట్టాలను చేసి కార్మికులను.. రైతులను.. కార్మికులను కట్టు బానిసలుగా మార్చిన మోడీ ప్రభుత్వపు దుర్మార్గాన్ని తిప్పి కొట్టాలని సీపీఎం ఈ సందర్బంగా కోరింది.
అందుకు కార్మిక. రైతు ల ఐక్యత ఒక్కటే మార్గం అని భవిషత్తు లో అటువంటి పోరాటాలు మేడే స్ఫూర్తి తో చేయాలని ఆ పార్టీ నేత రెడ్డి శంకరరావు కార్మికులకు పిలుపునిచ్చారు.
ఆటో కార్మికుల కు నష్టం చేసే rta చట్టంలో మార్పులు రద్దు చేయాలని. 3 రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని స్టీల్ ప్లాంట్ రక్షణకై ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు. కార్యదర్శి కుర్మారవు. బంగార్రాజు నాయుడు పాపారావు.. లు పాల్గొన్నారు..
మున్సపాలిటీలో నగర కార్యదర్శి జగన్మోహన్.. దాబతోట.. పువ్వాడ కళా శీల వద్ధ్ సీఐటీయూ నగర అధ్యక్షుడు బీ. రమణ సీఐటీయూ జెండాలు ఎగురవేశారు.