30.3 C
Hyderabad
March 15, 2025 09: 44 AM
Slider నిజామాబాద్

నర్సరీ పనులను పర్యవేక్షించిన మండల అధికారులు

#Bichkunda MDO

బిచ్కుంద మండలంలోని ఫథలాపూర్, పెద్ద తక్కడపల్లి ,చిన్నదేవాడ గ్రామాలలో మండల అభివృద్ధి అధికారి ఆనంద్ మండల పరిషత్ అధికారి మహాబూబ్ పర్యటించారు. ఫథలాపూర్,పెద్ద తక్కడపల్లి  గ్రామంలో నర్సరీ పనులను వారు పరిశీలించారు.

అనంతరం చిన్నదేవాడ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఎంపిడిఓ ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పనిచేయాలన్నారు. చెరువులో ఉన్న మట్టిని తీసుకెళ్లి పంట చేలలో పోసుకుంటే అధిక దిగుబడి వస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అనంతరం గ్రామంలో నర్సరీ లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరువురితో పాటు ఫతలాపూర్ సర్పంచ్ అరుణ్ కుమార్, పెద్ద తక్కడపల్లి సర్పంచ్ పుండలీక్, పంచాయతీ కార్యదర్శి అనురాధ కారోబారి మల్లికార్జున్లతో పాటు చిన్నదేవాడ గ్రామంలో ఉపాధి కూలీలు ఉన్నారు.

Related posts

పెన్షన్ డబ్బులు ఎవరో దోపిడి చేశారట

Satyam NEWS

ఎల్డర్స్: కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

Satyam NEWS

తెలుగుదేశం పార్టీని వదిలేయాలనుకున్న కోడెల

Satyam NEWS

Leave a Comment