28.2 C
Hyderabad
April 20, 2024 13: 48 PM
Slider నిజామాబాద్

నర్సరీ పనులను పర్యవేక్షించిన మండల అధికారులు

#Bichkunda MDO

బిచ్కుంద మండలంలోని ఫథలాపూర్, పెద్ద తక్కడపల్లి ,చిన్నదేవాడ గ్రామాలలో మండల అభివృద్ధి అధికారి ఆనంద్ మండల పరిషత్ అధికారి మహాబూబ్ పర్యటించారు. ఫథలాపూర్,పెద్ద తక్కడపల్లి  గ్రామంలో నర్సరీ పనులను వారు పరిశీలించారు.

అనంతరం చిన్నదేవాడ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఎంపిడిఓ ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పనిచేయాలన్నారు. చెరువులో ఉన్న మట్టిని తీసుకెళ్లి పంట చేలలో పోసుకుంటే అధిక దిగుబడి వస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అనంతరం గ్రామంలో నర్సరీ లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరువురితో పాటు ఫతలాపూర్ సర్పంచ్ అరుణ్ కుమార్, పెద్ద తక్కడపల్లి సర్పంచ్ పుండలీక్, పంచాయతీ కార్యదర్శి అనురాధ కారోబారి మల్లికార్జున్లతో పాటు చిన్నదేవాడ గ్రామంలో ఉపాధి కూలీలు ఉన్నారు.

Related posts

మెగాస్టార్ చిరంజీవి దాతృత్వానికి ధన్యవాదాలు

Satyam NEWS

కెఆర్ఎంబీ సమావేశానికి హాజరు కావాలని సిఎం కెసిఆర్ నిర్ణయం

Satyam NEWS

వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌లో ఈనెల 10న‌ సీతారాముల క‌ల్యాణం..!

Satyam NEWS

Leave a Comment