అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నల్లకుంట డివిజన్ లోని పాత రామాలయం కాలనీలో పాదయాత్రగా పర్యటించి, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ కాలనీలో పిల్లలకు ఒక పార్కు ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ పైప్ వేయించాలని, సీసీ రోడ్లను నిర్మించాలని, కొన్ని చోట్ల వీధి దీపాలను ఏర్పాటు చేయాలని అలాగే ఎత్తుగా పెరిగిన చెట్లను తొలగించాలని కోరారు.
పారిశుద్ధ్య కార్మికులు రోజు రాకపోవడం వలన వీధులన్నీ అపరిశుభ్రంగా ఉంటున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే చెట్ల కొమ్మలను తొలగించేందుకు, వీధి దీపాలను ఏర్పాటు చేసేందుకు, పరిశుభ్రత విషయంలో తక్షణమే వారి ఇబ్బందులను తొలగించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే అక్కడే
ఆదేశాలు జారి చేశారు. అలాగే ఇతర సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అమృత, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట