ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో గిరిజనులు, ఆదివాసుల ఆరాధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ మేడారం మినీ జాతర బుధవారం నుండి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1 నుండి 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు సుమారు 4 నుండి 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే టిఎస్ఆర్టీసి అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముందస్తు మొక్కుల కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సమ్మక్క సారలమ్మ వనదేవతలకు ప్రత్యేక మొక్కలుచెల్లించుకుంటున్నారు.