30.2 C
Hyderabad
April 27, 2025 19: 36 PM
Slider జాతీయం

న్యూ వైరస్ :మీడియాకు బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ వ్యాధి

media breaking news syndrome

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశంలో మీడియా సంస్థల పనితీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.ఢిల్లీలో నిర్వహించిన రామ్ నాథ్ గోయెంకా ఎక్స్ లెన్సీ ఇన్ జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడుతూ మీడియా సంస్థలు ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాయని ఛలోక్తులు విసిరారు.

తప్పుడు వార్తలు ప్రచారం చేసేవాళ్లు కూడా జర్నలిస్టులుగా చెలామణీ అవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ల కారణంగా పాత్రికేయ వృత్తికి తీరని కళంకం అని అభిప్రాయపడ్డారు. ఫేక్ న్యూస్ సంస్కృతి కారణంగా పాత్రికేయ రంగం లో అత్యున్నత ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ అంశం నేడు సమాజంలో అతిపెద్ద రుగ్మతగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

ప్రపంచ వేదికపై ‘ఏపీ బ్రాండ్’ ఇమేజ్

Satyam NEWS

వనపర్తిలో మెడికల్ షాపులో మంటలు

Satyam NEWS

పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూ లో స్వల్ప మార్పులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!