రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశంలో మీడియా సంస్థల పనితీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.ఢిల్లీలో నిర్వహించిన రామ్ నాథ్ గోయెంకా ఎక్స్ లెన్సీ ఇన్ జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడుతూ మీడియా సంస్థలు ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాయని ఛలోక్తులు విసిరారు.
తప్పుడు వార్తలు ప్రచారం చేసేవాళ్లు కూడా జర్నలిస్టులుగా చెలామణీ అవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ల కారణంగా పాత్రికేయ వృత్తికి తీరని కళంకం అని అభిప్రాయపడ్డారు. ఫేక్ న్యూస్ సంస్కృతి కారణంగా పాత్రికేయ రంగం లో అత్యున్నత ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ అంశం నేడు సమాజంలో అతిపెద్ద రుగ్మతగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.