గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పిడుగురాళ్ల మండలం కామేపల్లి ఏరియా స్థల పరిశీలన జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, మెడికల్ బోర్డ్ చైర్మన్ JC దినేష్ కుమార్ పాల్గొన్నారు.
కాగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెంట శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు క్రిష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ జంగా క్రిష్ణ మూర్తి తదితరులు ఉన్నారు.