దేశంలోని 11 రాష్ట్రాలలోని ఆసుప్రతుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడినట్లు సమాచారం అందుతున్నది. దాంతో పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.
అత్యవసరమైన కొన్ని పరిశ్రమలకు తప్ప ఆక్సిజన్ సరఫరాను ఆసుపత్రులకు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి చర్యలు చేపట్టింది.
మెడికల్ ఆక్సిజన్ సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రకటించింది.
ఆక్సిజన్ సిలెండర్లు తీసుకువెళ్లే వాహనాలను ఎక్కడా ఆపరాదని అన్ని రాష్ట్రాలకూ సమాచారం పంపింది.