సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా శ్రీకాళహస్తిలో 19 మందికి రూ. 34,07,000 చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా జగనన్న ఆరోగ్యశ్రీ ద్వారా 2434 రుగ్మతలు, రోగాలకు ప్రమాదాల వల్ల కలిగే వైకల్యాలకు చికిత్స అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇతర రోగాలు ప్రమాదాల వల్ల కలిగే వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులను సైతం అందిస్తూ ఎనలేని వైద్య సేవలు అందిస్తున్నారు .పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నసీఎం జగన్ పై అందరి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.