37.2 C
Hyderabad
April 19, 2024 12: 57 PM
Slider నిజామాబాద్

మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రి తో తాగుబోతుల వీరంగం

#HealthWorkers

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై తాగుబోతులు వీరంగం సృష్టించారు. దీనిపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ దుర్ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వాస్పత్రి లో జరిగింది. దాంతో శనివారం నాడు ఆస్పత్రి వైద్యులు సిబ్బంది ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  శుక్రవారం రాత్రి ఆరుగురు దుండగులు  మద్యం మత్తులో చికిత్స నిమిత్తం వచ్చి చికిత్స పొందిన అనంతరం ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు.

సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి ఫర్నిచర్ను ధ్వంసం చేశారని వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని  కోరారు.

కరోనా వైరస్ కాలంలో ఎన్నో కష్టాలకు ఓర్చుకుని తాము విధుల పట్ల అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ  కొన్ని కొన్ని ఇటువంటి ఘటనలు జరుగుతుండటం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

పాకిస్తాన్ ను దిగజారుస్తున్న పాలకుల వైఖరి

Bhavani

త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

Bhavani

[Professional] Cum Ingredients Best Safe Male Enhancement Pill

Bhavani

Leave a Comment