27.7 C
Hyderabad
April 20, 2024 02: 08 AM
Slider తూర్పుగోదావరి

కాకినాడలో వైద్య విద్యార్థిని దారుణ హత్య

#murdercase

కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం డిప్లమో అనస్తీషియా చదువుతున్న గుంపుల సుధారాణి(19) అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది.

సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ చెందిన సుధారాణి, పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కాకి పాడు కు చెందిన మానేపల్లి రాజు (21), గత పది నెలల నుంచి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరూ కలిసి కాకినాడ ద్వారకా లాడ్జిలో దిగారు. ఏమైందో ఏమో కారణాలు తెలియలేదు.

నిన్న రాత్రి గొడవపడి భర్త రాజు సుధారాణి కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.. ఆ తర్వాత రాజు ఏలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

బూస్టర్ డోస్‌ పై WHO కీలక ప్రకటన

Sub Editor

ప్రొటెస్ట్ టైం:ముస్లిం యునైటెడ్‌ యాక్షన్‌ కమిటీ భారీ ర్యాలీ

Satyam NEWS

బీ ఫామ్ తీసుకున్న దుబ్బాక టి ఆర్ ఎస్ అభ్యర్థి సుజాత

Satyam NEWS

Leave a Comment