హనుమకొండ లోని బాలసదనం అనాధ పిల్లలతో అనురాగ్ హెల్పింగ్ సొసైటి నేడు ఆత్మీయ సమ్మేళనం – ఆటవిడుపు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అతిథిగా అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డాక్టర్ అనిత రెడ్డి వచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాధ పిల్లలతో ప్రేమగా ఉండాలని అప్పుడు పిల్లలు అన్ని రకాలుగా ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. అలా చేయడం వల్ల ఉత్సాహంగా చదువు కొంటారని వారికి కొంత ప్రేమని అందిస్తే వారు తమకు అందరూ ఉన్నారు అని భావించి మరింత ముందుకు వెళ్తారని అన్నారు. పిల్లలకు ఆత్మీయుత, ప్రేమ పంచాలనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అనితా రెడ్డి తెలిపారు.
అనాధ పిల్లలతో గడపటం సంతోషంగా ఉందని పిల్లల సేవ విశ్వమానవ సేవ అని అన్నారు. ప్రతి ఒక్కరు తమకు తోచిన మేర వీరికి సహాయసహకారాలు అందించాలని కోరారు. పిల్లలు ఈ సందర్భంగా పాటలుపాడి, జోక్ లు చెప్పి ఆనందంగా గడిపారు.
అనంతరం పిల్లలకు నచ్చిన అల్పాహారం ఎగ్ పఫ్ లు, సమోసాలు, కేకులు పిల్లలకు పెట్టి వారితో కలిసి అమ్మలా కబుర్లు చెబుతూ అనితా రెడ్డి పిల్లలకు ఎన్నో మంచి విషయాలు, విద్య విలువలను తెలియచేశారు. ఈ కార్యక్రమం లో అనితా రెడ్డి తోపాటు శ్రీ లత, సుజాత, కళ్యాణి పాల్గొన్నారు.