ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పశ్చిమ గోదావరి జిల్లాలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజా సంరక్షణ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించారు.
దేవాలయాలు, చర్చిలు, మసీదులలో, బహిరంగ ప్రదేశాలలో ప్రజలు గుమికూడటాన్ని నిషేధించారు.
జాతరలు, పెళ్లిళ్లు, ఎగ్జిబిషన్ లు, సంతలు కూడా నిషేధించారు. అత్యవసర పరిస్థితుల్లో 25 మంది నుండి 50 మంది వరకు మాత్రమే సమావేశం అయ్యేందుకు అనుమతులు ఇస్తారు.
ప్రజలు మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే 100 రూపాయలు జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం కూడా నిషేధం అని ఉత్తర్వులిచ్చారు.
ప్రజా ఆరోగ్య భద్రత కోసం అందరూ పోలీస్ వారికి సహకరించాలని పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ లు కోరారు.