కొల్లాపూర్ నియెజకవర్గంలోని ముఖ్యమైన రోడ్డు అయిన పుల్గర్ చర్ల నుండి శ్రీరంగాపూర్ వెళ్లే రహదారిని డబుల్ రోడ్డుగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
వారు ఈ మేరకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డికి నేడు ఒక వినతి పత్రం సమర్పించారు. ఇంతకు ముందు పెంట్లవెల్లి నుండి పుల్గర్ చర్ల గ్రామం వరకూ డబుల్ రోడ్డు చేశారని వారు తెలిపారు.
అదే విధంగా పుల్గర్ చర్ల నుంచి శ్రీరంగాపూర్ రోడ్డు కూడా డబుల్ రోడ్డు చేస్తే కొల్లాపూర్ కు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పడుతుందని పుల్గర్ చర్ల గ్రామ ప్రజల తరపున బాబురెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందచేశారు.
పుల్గర్ చర్ల నుండి శ్రీరంగాపూర్ వెళ్లే రహదారి డబుల్ రోడ్డు మార్చాలనే తమ సమస్యపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని బాబురెడ్డి తెలిపారు.
దీనికి స్పందించి తొందర్లోనే పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.