మానసిక వికలాంగుల పట్ల సమాజం ఎంతో బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారిలో అవగాహన కలిగించే విధంగా చర్యలు చేపట్టడం కూడా అత్యవసరం.
ఈ అవసరాన్ని గుర్తించి వరంగల్ లోని మల్లికాంబ మనో వికాస కేంద్రం దివ్వాంగుల పిల్లల దినోత్సవం నిర్వహిస్తున్నది.
ఇందులో భాగంగా అనురాగ్ హెల్పింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కరుకుల అనితారెడ్డి నేడు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మనోవైకల్యం ఉన్న ప్రత్యేక పిల్లలను ఏ విధంగా చూసుకోవాలో ఆమె వివరించారు. మానసిన వైకల్యం ఉన్న వారికి నేర్పాల్సిన మెళకువలను అనితారెడ్డి వివరించారు.
మానసిక వైకల్యం ఉన్న పిల్లలు తమతను తాము అఘాయిత్యాల నుంచి కాపాడుకోవడానికి, లైంగిక దాడుల నుంచి తప్పింపుకోవడానికి వారి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలను నేర్పాల్సిన అవసరం కూడా ఉందని అనితా రెడ్డి తెలిపారు.