28.7 C
Hyderabad
April 25, 2024 06: 41 AM
Slider హైదరాబాద్

మంచి సందేశం ఇచ్చే చిత్రం పలాస 1978

manda krishna

పలాస 1978 చిత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. చరిత్రను చెబుతూ భవిష్యత్తును గుర్తు చేసే అద్భుత చిత్రం ఇదని ఆయన అన్నారు. నేడు మంద కృష్ణ మాదిగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని దేవీ ధియేటర్ లో పలాస 1978 చిత్రాన్ని వీక్షించారు. పలాస సినిమా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ విమర్శకుడు కత్తి మహేష్ తదితరులు నేడు మంద కృష్ణ మాదిగను కలిసిన వారిలో ఉన్నారు.

చిత్రం చూస్తున్నంత సేపూ తనకు మంచి అనుభూతి కలిగిందని మంద కృష్ణ మాదిగ అన్నారు. సందేశాత్మక చిత్రాలు కరవు అయిన ఈ రోజుల్లో తమ్మారెడ్డి భరద్వాజ లాభాపేక్ష లేకుండా సినిమా తీయడం గొప్ప విషయమని ఆయన అన్నారు. అద్భుతమైన చిత్రాన్ని సమాజానికి అందించిన తమ్మారెడ్డి భరద్వాజను మంద కృష్ణ మాదిగ అభినందించారు.

Related posts

కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్

Bhavani

రాయలసీమ ప్రాజెక్ట్‌ల భవిష్యత్‌పై టీడీపీ సదస్సు ..

Satyam NEWS

నవరత్నాలలో భాగంగా మరో ముందడుగు…!

Satyam NEWS

Leave a Comment