ప్రజాసేవకే అంకితమై అందరివాడు అరవిందుడు అన్న బిరుదును గడించిన గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గురువారం పార్టీ కార్యాలయంలో మెట్రో టీవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో టివి తరపున, తన తరపున, నరసరావుపేట నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
2021 సంవత్సరం లో నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖసంతోషాలు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.
నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తనవంతుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మెట్రో టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మెట్రో టీవీ స్టాఫ్ రిపోర్టర్ పయ్యావుల శ్రీనివాస్, నరసరావుపేట మెట్రో టీవీ రిపోర్టర్ బాబు, రొంపిచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.