రాష్ట్ర వ్యాప్తంగా MGNREGS నిధుల విడుదల విషయంపై బుధవారం నాడు కడపజిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా MGNREGS నిధులతో రోడ్లు వేసిన వారికి హైకోర్టు ఆదేశాల మేరకు దాదాపు 90 శాతం మంది నిధులు మంజూరు అయ్యాయని, మంజూరైనటువంటి నిధులను 28.7% వరకు విత్ హెల్డ్ చేసి విడుదల చేశారని తెలిపారు.దాదాపు ఈ నిమిషం వరకు 10 శాతం మందికి డబ్బులు అంద చేయలేదని ఈ విషయాన్ని డిపిఓ దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిపారు.
MGNREGS నిధుల ద్వారా పనిచేసి క్వాలిటీ కంట్రోల్,సోషల్ ఆడిట్ పూర్తయిన వారికి పూర్తిస్థాయిలో(100% శాతం) నిధులను విడుదల చేయమని గౌరవ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా,వారి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం వన్ 28.7% శాతం నిధులను విత్ హెల్డ్ లో పెట్టి(పట్టుకుని) నిధులు విడుదల చేసిందని ఈ సందర్భంగా తెలిపారు.
హైకోర్టు ఆదేశాలను దిక్కరించినందుకు ఐదు మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడింది కాబట్టి అందుకు భయపడి నిధులు విడుదల చేశారని ఇప్పటి వరకు 90% శాతం మందికి డబ్బులు ఇచ్చారని,ఇంకా సిద్ధవటం మండలం మాధవరం లో గంజి సుబ్బరాయుడు కి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కోడూరు మండలంలో కె.సుధాకర్ అనే అతనికి 35 లక్షలు డబ్బులు పడి ఉన్నా ఇంకా ఇవ్వలేదని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 10% శాతం మంది డబ్బులు పడి ఉన్నా ఇవ్వకుండా ఆపి ఉన్నారని తెలిపారు. హై కోర్ట్ 15 తేదీ లోపల పనిచేసిన ప్రతి ఒక్కరికి డబ్బులు పూర్తిస్థాయిలో అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఆదేశాల ప్రకారం వీరందిరికి డబ్బులు ఇవ్వని ఎడల తాము హైకోర్టును దిక్కరణకు వెళ్లనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి,జిల్లా కలెక్టర్ కి, డిపిఓకి తెలిపారు.
రాష్ట్రస్థాయి ఐఏఎస్ అధికారులకే కోర్టు ధిక్కరణ శిక్ష పడిందని గుర్తుచేస్తూ మీరు దయచేసి కోర్టు ధిక్కరణ కు పూనుకోవద్దని ఒకవేళ ఎవరైనా మీ క్రిందిస్థాయి అధికారులు చేయకపోయినా మీరే బాధ్యులు అవుతారు కాబట్టి, మీరు వెంటనే తగు చర్యలు తీసుకొని వారి బిల్లులను వారికి అందజేయాలని కోరారు.
MGNREGS యాక్ట్ ను 2006లో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ అనంతపురం జిల్లా నక్కినల్ మండల కేంద్రం బండ్లపల్లి లో ప్రారంభించారని,చట్టం వివరణ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి ప్రతి పైసా లో 60% లేబర్ కాంపోనెంటు,40% మెటీరియల్ కాంపోనెంటు అని చెప్తుందని,కేంద్రం విడుదల చేసినటువంటి ప్రతి ఒక్క పైసా ను మూడు రోజుల లోపల MGNREGS ప్రాజెక్ట్ డైరెక్టర్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలనేది యాక్ట్ లో ఉందని ఒక వేళ మూడు రోజుల లోపల మీరు అకౌంట్ కు నిధులను విడుదల చేయలేక పోతే 12% వడ్డీ వేసి కట్టాలని యాక్ట్ చెబుతుందని అన్నారు.
MGNREGS నిధుల ద్వారా ఇప్పటికీ పనులు పూర్తిచేసి రెండున్నర సంవత్సరం అయిందని, అసలే ఇంతవరకు రాలేదు అని ఇప్పుడు ఇచ్చిన అసల్లో కూడా 28.7% శాతం నిధులను పట్టుకుని ఉన్నారని, అసలు ఇంతవరకు ఇవ్వలేదు వడ్డీ ఎప్పుడు ఇస్తారయ్యా అని భత్యాల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి సంవత్సరానికి కావలసిన నిధులు ఇస్తే నాలుగు నెలల్లోనే దాన్ని అయిపోచేశారని కేంద్రం ఇచ్చినటువంటి ప్రతి రూపాయిలోనూ 60 పైసలు లేబర్ కాంపోనెంట్,40 పైసలు మెటీరియల్ కాంపోనెంట్ మేము నాలుగు నెలల్లోనే పూర్తి డబ్బు ఖర్చు పెడతాం, మళ్లీ నాలుగు నెలలకు అంత,నాలుగు నెలలు అంత ఇవ్వమంటే ఫస్ట్ ఇంద హిస్టరీ ఆఫ్ ఇండియా MGNREGS లో లేబర్ కాంపోనెంట్ మీద ఎంక్వయిరీ విజయనగరం జిల్లాలో జరుగుతోందని ఎంక్వయిరీ ఇచ్చుకునే అంత ఘనత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి దక్కిందని తెలిపారు.
ఓ ప్రాంతంలో రోజుకు 250 మంది ఉపాధి హామీ కూలీలు ఒక వైసిపి నాయకుడు తోటలో పనిచేస్తున్నారని మీడియాలో వచ్చిందని అన్నారు.
ఈ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేసే ప్రతి ఒక్కరూ నిరుపేదలు, వారు వారి పొట్ట నింపుకోవడానికి ఉపాధి హామీ లో పని చేస్తుంటే,ఆ పని చేసే కూలీల బిల్లులు రెండు నెలలుగా చెల్లించక పోవడం చాలా దారుణం అని బత్యాల వ్యాఖ్యానించారు.
గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఇంకా కూలీలకు సుమారు 1000 కోట్ల మేర బిల్లులు చెల్లించవలసి ఉందని ఆ కూలీల బిల్లులను చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఇప్పుడున్న నిత్యావసరాల ధరలను చూసి ఏమీ కొని తినలేక ఒక పూట తిని మిగిలిన రెండు పూటలా పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
అలాగే 36 రకాల (గోకులాలు,మినీ గోకులాలు,హౌసింగ్,నీరు చెట్టు ఇంకా పలురకాల) పనులకు సంబంధించి నిధులను కూడా కేంద్రం విడుదల చేసిందని వాటిని పని చేసిన వారికి అందజేయాలని కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఇప్పటికైనా ఉపాధి హామీ కూలీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ జూలై, ఆగస్టు నెలలకు సబందించి డబ్బుతో పాటు ఇప్పటివరకు కోలిపనిచేసిన మొత్తాన్ని కూలీల బ్యాంక్ ఖాతాలో నేరుగా పడేలా బిల్లులు విడుదల చేయాలని బత్యాల డిమాండ్ చేశారు.
MGNREGS ద్వారా చేసిన పనులకు నిధులు చెల్లించక పోతే MGNREGS యాక్ట్ ప్రకారం హైకోర్టు లో పిల్ దాఖలు చేసి 0.05 శాతం వడ్డీతో సహా వసూలు చేస్తుమని బత్యాల గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంజీవరావు,మండల పార్టీ అధ్యక్షుడు కోవూరు సుబ్రమణ్యం నాయుడు,పార్లమెంట్ tnsf అధ్యక్షుడు రేవూరి వేణుగోపాల్,అద్దేపల్లి ప్రతాప్ రాజు,మాజి మండల పార్టీ అధ్యక్షుడు బాసినేని వెంకటేశ్వర్లు నాయుడు, కృష్ణమూర్తి నాయుడు, ఇడిమడకల కుమార్,మాజి కౌన్సిలర్ రామచంద్రయ్య ఆచారి,రాంనగర్ నరసింహ,తెలుగురైతు సుబ్బనరసయ్య నాయుడు,ధరూరి చైతన్య,నరసింహ నాయుడు, శవనవారిపల్లి సర్పంచ్ కోటయ్య నాయుడు,ఓ. మల్లిఖార్జున రెడ్డి,పోలి శివకుమార్,మాజి ఎంపిటిసి గ్రందే బాలసుబ్రమణ్యం,నాగిశెట్టి చంద్రమౌళి,గుంటి హేమంత్ కుమార్,శివ,బిసిఆర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.