జాతిపిత మహాత్మా గాంధీ జయంతికి ఒక సూక్ష్మ కళాకారుడు అరుదైన నివాళి అర్పించాడు. గుండు పిన్ను పై మహాత్మా గాంధీ నడుస్తున్న బంగారు విగ్రహాన్ని తయారు చేశాడు.
అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ అరుదైన నివాళి అర్పించినట్లు జగిత్యాల తులసి నగర్ కు చెందిన సూక్ష్మ కళాకారుడు(micro artist) డాక్టర్ గుర్రం దయాకర్ (Cell 9100624689) తెలిపాడు.
మహాత్మా గాంధీ బంగారు విగ్రహం బరువు 0.27 మిల్లి గ్రాములు ఉంది. దీన్ని తయారు చేసేందుకు 12 గంటల సమయం పట్టింది.
హింస లేకుండా శాంతి మార్గంలో భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ బంగారు విగ్రహాన్ని తన సూక్ష్మకళ ద్వారా తయారు చేయడం తన అదృష్టం అని దయాకర్ తెలిపాడు.