కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దతక్కడ్పల్లి గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో బిచ్కుంద మండల అభివృద్ధి అధికారి ఆనంద్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
అక్కడ మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలు, ఉపాధ్యాయులు కిరణ్, పంచాయతీ కార్యదర్శి రాజు ఉన్నారు.