వలస కార్మికులు ముంబయిని ఖాళీ చేస్తున్నారు. దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా మళ్లీ ముంబయిలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో వలస కార్మికలు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ముంబయిలోని లోమాన్య తిలక్ టర్మినల్ వద్ద నిన్నటి నుంచి వలస కార్మికులు కిక్కిరిసి ఉన్నారు. ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లలో లెక్కకు మించి ఎక్కి కూర్చుని తమ స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు.
లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ప్రభుత్వం చెబుతున్నా కార్మికులు నమ్మడం లేదు.
కరోనా కారణంగా మళ్లీ లాక్ డౌన్ విధిస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న వలస కార్మికులు ముంబయిలో ఉండాలంటే ఆందోళన చెందుతున్నారు.