ఆదిలాబాద్ జిల్లా కేద్రంలోని తాటిగుడ కాలనీలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పారుక్ హైమ ద్ వీరంగం సృష్టించారు. చిన్న పిల్లల మధ్య ఏర్పడిన గొడవలో తన రాజకీయ ప్రత్యర్ధుల పై కాల్పులు జరిపారు.
ఓ చేత్తో కత్తి, మరో చేత్తో రివాల్వర్ తో దాడికి తెగపడ్డారు. నాలుగు రౌండ్ లు కాల్పులు జరిపారు. ఈ దాడి లో కజిన్ బ్రదర్ అయిన సయ్యద్ జామీర్ కు రెండు బుల్లెట్స్ దిగగా, సయ్యద్ మాన్నన్ తలపై కత్తి గాయమైంది.
మాన్నాన్ కొడుకు మోతె సీన్ ఛాతీ, వీపు భాగంలో రెండు బుల్లెట్స్ దిగాయి. సమాచారమందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను రిమ్స్ కు తరలించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న వీరిలో మోతేసి న్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా దాడి కి పాల్పడ్డ పారూక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు 307, ఆయుధ చట్టం 27/30 కింద కేసు నమోదు చేసుకొని జుడిషియల్ కష్టడికి తరలించారు. బాధితులను ఎమ్మేల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పరామర్శించారు.
కాలనీలో పోలీసు పికేటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పరోక్ వాడిన .32 రివాల్వర్ ను పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ రద్దు చేయాలని కలెక్టర్ కు సిపారస్ చేశారు.