హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ కు చెందిన దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎం ఐ ఎం నాయకుడు షకీల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బట్ట బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి బాపు రాజు డిమాండ్ చేశారు.
ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల సంఘాలు ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాపు రాజు విజ్ఞప్తి చేశారు.