కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద పట్టణ ప్రజల అవసరాలకోసం నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి నేడు ప్రారంభించారు.
అనంతరం కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్ కు వచ్చే ప్రజలు, పర్యాటకుల అహ్లాదం కోసం రూ. 20 లక్షల ఖర్చు చేసి తెప్పించిన 24 సీట్ల సామర్ధ్యం కలిగిన అధునాతన బోట్ను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజి రెడ్డి, పట్టాన మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, ఎంపీపీ దొడ్ల వెంకట రాం రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ కృష్ణ రెడ్డి, పెరిక శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్, ఎజాజ్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.