మున్సిపల్ వర్కర్స్ నుండి గ్రామ పంచాయతీ కార్మికులను దేవుళ్ళు అని కరోనా లాక్ డౌన్ కాలంలో పొగిడిన ముఖ్యమంత్రి కెసిఆర్ వీరికి వేతనాలు ఎందు పేంచలేదో చెప్పాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులతో రోషపతి మాట్లాడుతూ 11వ PRC ప్రకారం కనీస వేతనం 24000 రూపాయలు ఇవ్వాలని, కోరారు.
రాష్ట్రంలో ఇతర ఉద్యోగులకు పెంచిన విధంగా మున్సిపల్ కార్మికులకు కూడా పెంచాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఇంటి కిరాయి 12 నెలల ఎరియర్స్ ను నగదు రూపంలో చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముత్తమ్మ, దుర్గారావు, సైదులు, రవి, చంద్రకళ, కుమారి, రాంబాయి, దేవకరుణ, కాంతి, పుల్లయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.