పట్టభద్రులు, ఉన్నత విద్యావంతులు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్టభద్రులను విజ్ఞప్తి చేసారు.
ఓటు వేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు భద్రత చర్యలు చేపట్టారని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుస్తారన్న విశ్వాసం తమకుందని పేర్కొన్నారు.
ఉదయం 8గంటలకే ఖమ్మం జిల్లా కేంద్రంలోని శీలం సిద్దారెడ్డి(SSRJ) జూనియర్ కళాశాలలోని పోలింగ్ బూత్ లో పట్టభద్రల క్యూ లైన్ లో నిల్చుని మంత్రి పువ్వాడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం నియోజకవర్గ పరిధిలోని రఘునాధపాలెం మండలం, ఖమ్మం ఒకటి, రెండవ, మూడవ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళి ని పరిశీలించారు.