28.2 C
Hyderabad
April 20, 2024 12: 06 PM
Slider పశ్చిమగోదావరి

ఎమ్మార్పీఎస్ నేత కందుల రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఆళ్ళ నాని

#aallanani

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి, సీనియర్ దళిత నాయకులు కందుల రమేష్ మాతృమూర్తి కందుల ప్రేమలీల ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా కందుల రమేష్ కుటుంబాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), నగర మేయర్ షేక్.నూర్జహాన్ పెదబాబు, సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లం గోళ్ళ. శ్రీలక్ష్మీ వైకాపా నాయకులు శనివారం ఉదయం తంగేళ్లమూడిలోని కందుల రమేష్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.

తంగెళ్ళమూడి గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యురాలిగా కందుల ప్రేమలీల రెండు పర్యాయాలు గెలుపొంది,ప్రజలకు ఆమె అనేక సేవలు అందించారని,ఆమె స్థానిక ప్రజలకు చేసిన సేవలను మంత్రి ఆళ్ళ.నాని కొనియాడారు. ప్రజలకు సేవ చేసిన నాయకులు ప్రస్తుతం  భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల మనసులో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచి ఉంటారని మంత్రి అన్నారు. కందుల ప్రేమలీల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ముందుగా కందుల ప్రేమలీల చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఆళ్ళనాని, మేయర్ నూర్జహాన్ పెదబాబు, వైకాపా నేతలు ఘనంగా నివాళులర్పించారు. 

ఈ కార్యక్రమంలో యుడా చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం,  నగర డిప్యూటీ మేయర్ లు గుడిదేశీ శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచెం మైబాబు వైకాపా నగర అధ్యక్షులు బొద్ధాని శ్రీనివాస్, నగర కో ఆప్షన్ సభ్యులు ఎస్ఏంఆర్ పెదబాబు, దళిత నాయకులు మున్నుల జాను గురునాథ్, జాతీయ ఎస్సీ నాయకులు పొలిమేర హరికృష్ణ, రాష్ట్ర దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవి ప్రకాష్ ఎమ్మార్పీఎస్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, దళిత నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దారుణం

Murali Krishna

ఈ బాలుడు పలుభాషల పలుకుతోడు

Satyam NEWS

విత్ సారో లుక్స్:నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేక

Satyam NEWS

Leave a Comment