డీఈవో పూల్ సమస్య, 39 మంది హిందీ పండితులు పెండింగ్ జీతాల సమస్య సహా పలు సమస్యలను రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లింది. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కూన రంగనాయకులు 39 మంది హిందీ పండితుల జీతాల సమస్య పై ప్రత్యేకంగా మాట్లాడారు. సత్వరమే చర్యలు తీసుకుంటామని, తనకు ఫాలో అప్ చేసే వారు ఒకరు ఉంటే సదరు ఫైల్ స్థితిగతులను తెలుసుకొని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.