సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు మఠంపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జగదీష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పిచ్చయ్య మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం స్థానిక వైద్యశాల లోని పలువురి రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు,బ్రెడ్డు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల తెరాస ఉపాధ్యక్షుడు కొండేటి సుధాకర్ రెడ్డి, ఇరిగెల వెంకటరెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షుడు పల్లె మట్టయ్య,మహిళా అధ్యక్షురాలు కందుల నాగలక్ష్మి,మండలం అన్ని గ్రామాల సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు జాల కిరణ్ యాదవ్,వెంకటరమణ,డాక్టర్ వంశీ, దేవపంగు అచ్చయ్య,గుండె పంగు నరేష్, అయ్యప్ప,బేత శివారెడ్డి,వల్లపుదాసు సురేష్, వీరంరెడ్డి వీరారెడ్డి,మద్ది హుస్సేన్ రెడ్డి,షేక్ రహీం,రాజీవ్,భద్రంరాజు రాంబాబు,భద్రం రాజు కృష్ణ కుమారి,చెడపంగు జోజి,ప్రభు, పత్తి వీరయ్య,నందిపాటి సోమయ్య,కోట వెంకటేశ్వర్లు పలువురు తెరాస నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ హుజూర్ నగర్